‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ స్టాటస్  తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఇదే చిత్రాన్ని హీందీలో ‘కబీర్ సింగ్’ గా రీమేక్ చేసి అక్కడ కూడా అదే రేంజ్ పాపులారిటీ సంపాదించుకున్నాడు. పైగా బాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ఇప్పుడీ బోల్డ్ అండ్ డేర్ డైరెక్టర్ బాలీవుడ్ లో మరో అదిరిపోయే స్ర్కిప్ట్ తో ఓ క్రైమ్ డ్రామాను తెరకెక్కించనున్నడట. ఆల్రెడీ స్ర్కిప్ట్ వర్క్ కూడా జరుగుతోందట. ప్రస్తుతం ఈ దర్శకుడితో బాలీవుడ్ నిర్మాతలు  ఎంత బడ్జెట్ కైనా వెనుకాడకుండా సినిమాలు తీయడానికి ముందుకొస్తున్నారట.

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి..  నటీనటుల ఎంపిక త్వరలోనే జరగనుందట. ‘అర్జున్ రెడ్డి’ తరహాలోనే ఒక బోల్డ్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. అతి త్వరలో సెట్స్ మీదుక వెళ్ళనున్న ఈ సినిమాతో సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ లోనే దర్శకుడిగా స్థిరపడతాడేమో చూడాలి.

Leave a comment

error: Content is protected !!