తమిళ యంగ్ హీరో ధనుష్, వైవిధ్య చిత్రాల దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు కలయికలో తెరకెక్కుతోన్నయాక్షన్ థ్రిల్లర్ ‘జగమే తంతిరమ్’.  వైనాట్ స్డూడియోస్ బ్యానర్ పై శశికాంత్ నిర్మిస్తోన్న ఈ సినిమా తెలుగులో ‘జగమే తంత్రం’ గా విడుదల కానుంది. మలయాళ కథానాయిక ఐశ్వర్యా లక్ష్మి కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్  మరియు మోషన్ పోస్టర్ ను చిత్రం బృందం ఈరోజే విడుదల చేసింది. కాగా ఈ పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

తెల్ల చొక్కా, తెల్ల  పంచెకట్టులో రివీలైన ధనుష్ .. చేతిలో గన్ తో భయపెడుతున్నాడు. ఎర్లియర్ గా రజనీకాంత్ తో పేట్ట సినిమా తెరకెక్కించి సాలిడ్ హిట్టు కొట్టిన కార్తిక్ సుబ్బరాజు ఈ చిత్రంలో ధనుష్ ను వెరైటీ గా ప్రజెంట్ చేయబోతున్నాడు. మే 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోన్న జగమే తంత్రం చిత్రం ధనుష్ కు ఏ రేంజ్ లో క్రేజ్ తెచ్చిపెడుతుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!