టాలీవుడ్ లో దర్శకుడిగా సురేంద్రరెడ్డికి మంచి పేరే ఉంది. టాప్ మోస్ట్ యంగ్ స్టార్స్ తో పాటు సీనియర్ స్టార్ చిరంజీవితో  సైతం  భారీ సినిమాలు తీసిన రికార్డు అతడిది. లాస్టియర్ మెగాస్టార్ ‘సైరా’ ఏ రేంజ్ లో హిట్టయిందో తెలిసిందే. ఇతర భాషల్లో నష్టాలు మిగిల్చినా .. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రికార్డు కలెక్షన్సే రాబట్టింది. అలాంటి సినిమాను డైరెక్ట్చేచేసిన సురేంద్ర రెడ్డి  తదుపరి చిత్రం ఏంటనే ఆసక్తి అందరిలోనూ ఉంది. నిజానికి సూరి తన తర్వాత సినిమాను ప్రభాస్ తోగానీ, మహేశ్ బాబుతోగానీ చేయాలనుకున్నాడట. ఆ ఇద్దరూ ప్రస్తుతం పలు ప్రొజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. అందుకే బ్యాక్ టు బ్యాక్ హిట్సిస్తోన్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ తో సినిమా ప్లాన్ చేశాడట. ఆ మేరకు మంచి స్టోరీ లైన్ కూడా అనుకున్నాడట. అయితే ఆ తర్వాత మనసు మార్చుకున్నాడట.

ఈ ఏడాది ని బ్లాక్ బస్టర్ తో స్వాగతం చెప్పిన బన్నీ తోనే తన నెక్స్ట్ మూవీ   చేయాలని డిసైడయ్యాడట. ఆల్రెడీ వీరిద్దరి కాంబినేషన్ లో ‘రేసుగుర్రం’ లాంటి బ్లాక్ బస్టర్ వచ్చింది. ఆ క్రేజ్ తోనే బన్నీతో సినిమా ప్లాన్ చేశాడట సూరి. అతడు మంచి కథ చెబితే బన్నీకాదనడు. అయితే  అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ , వేణు శ్రీరామ్, మురుగదాస్ లాంటి దర్శకులతో వరుస సినిమాలు చేయబోతున్నాడు. ఒక వేళ సురేంద్రరెడ్డితో సినిమా ఓకే అయితే.. ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ అయ్యకనే తన సినిమాను  సెట్స్ మీదకు తీసుకెళ్ళాలి. మరి అంతవరకూ సురేంద్రరెడ్డి ఆగుతాడో .. లేక వేరే స్టార్ హీరోతో కమిట్ అవుతాడో చూడాలి.

Leave a comment

error: Content is protected !!