అక్కినేని వారసుడు అఖిల్ .. మొదటి విజయం కోసం ఎప్పటినుంచో కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నాడు. ఎంతమంది దర్శకుల్ని మార్చినా.. ఎలాంటి కథలు ఎంపికచేసినా.. ఫలితం మాత్రం దక్కడం లేదు. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నాలుగో చిత్రమైన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయబోతున్నారు.

ఇక అఖిల్ ఐదో చిత్రానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా సైలెంట్ గా జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీనికి నిర్మాత నితిన్ అవడం ఒక విశేషమైతే.. దానికి అఖిల్ వితౌట్ రెమ్యూనరేషన్ పని చేయనుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అఖిల్ మొదటి చిత్రం అఖిల్ ను నిర్మించింది నితినే అన్నది తెలిసిన విషయమే. ఆ మూవీ నిర్మించినందుకు నితిన్ కు దాదాపు 25కోట్ల నష్టం వచ్చింది. అందుకే ఆ లాస్ ను కవర్ చేయడానికే అఖిల్ .. నితిన్ కు ఫ్రీగా సినిమా చేస్తానని మాటిచ్చాడట. సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో త్వరలో లాంచ్ కానున్న ఈ మూవీ నితిన్ కు, అఖిల్ కు ఏ రేంజ్ లో సక్సెస్ అందిస్తుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!