Shopping Cart 0 items - $0.00 0

‘నారప్ప’ కోసం రంగంలోకి బాబీ

విక్టరీ వెంకటేశ్ ప్రస్తుతం ‘నారప్ప’ మూవీ  షూటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. తమిళ హీరో ధనుష్, మలయాళ మంజూ వారియర్ నటించిన ‘అసురన్’ సినిమాకిది తెలుగు వెర్షన్ కాగా.. ఆయా పాత్రల్లో వెంకీ, ప్రియమణి నటిస్తున్నారు. కుటుంబ కథాచిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన శ్రీకాంత్ అడ్డాల ‘నారప్ప’ చిత్రాన్ని తెరకెక్కిస్తూండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాగా.. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకోసం ‘వెంకీమామ’ దర్శకుడు బాబీ కూడా రంగంలోకి దిగుతున్నాడట. రవితేజ తో ‘పవర్’, యన్టీఆర్ తో జై లవకుశ తెరకెక్కించి యాక్షన్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న బాబీ.. ‘నారప్ప’ లోని యాక్షన్ ఎపిసోడ్స్ ను డైరెక్ట్ చేస్తాడట.

రీసెంట్ గా బాబీ దర్శకత్వం వహించిన ‘వెంకీ మామ’ టాలీవుడ్ లో డీసెంట్ కలెక్షన్స్ తెచ్చిపెట్టింది.  అందులోని యాక్షన్ ఎపిసోడ్స్ కు బాగా ఇంప్రెస్ అయిన సురేశ్ ప్రొడక్షన్స్ వారు ‘నారప్ప’ లో కూడా  యాక్షన్ సీక్వెన్సెస్ ను డిజైన్ చేసే బాధ్యతను బాబీకి అప్పగించారట. ఆ విషయంపై..  అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ కూడా త్వరలోనే రానుందట. ప్రస్తుతం అనంతపురంలో కొన్ని ప్రధాన సన్నివేశాల చిత్రీకరణలో ఉన్న ‘నారప్ప’ లోని యాక్షన్ ఘట్టాలు ‘అసురన్’ ను ఎలా మ్యాచ్ చేస్తాయో చూడాలి.

Leave a comment

error: Content is protected !!