Shopping Cart 0 items - $0.00 0

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు, సినీ ప్రియులకు ఇది నిజంగా స్వీట్ న్యూసే. మహానటుడు యన్టీఆర్  ‘ఎదురులేని మొనగాడు’ చిత్రంతో తమ బ్యానర్ ను స్టార్ట్ చేసిన వైజయంతి సంస్థ .. నిన్నటి ‘మహానటి’ వరకూ ఎన్నో అద్భుతమైన విజయాల్ని చవిచూసింది. మూడు తరాల హీరోలతో చిత్రాల్ని నిర్మించి..  ఈ జెనరేషన్ లోనూ మరిన్ని చిత్రాల్ని   నిర్మిస్తూ అప్రతిహతంగా దూసుకుపోతున్న వైజయంతి వారు టాలీవుడ్ లోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ఆ బ్యానర్ లో ఒక బిగ్గెస్ట్ మూవీ అనౌన్స్ మెంట్ జరగబోతోంది. అది  ఈ ఏడాదికే భారీ బడ్జెట్ చిత్రం.  ఆ సినిమాకి దర్శకుడు నాగ్ అశ్విన్ అయితే..  హీరో  ప్రభాస్ అవడం.. టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వైజయంతి సంస్థ వారు ఒక వీడియో ను విడుదల చేశారు.  యాన్ ఎపిక్ జర్నీ బిగిన్స్ విత్ ప్రైడ్ అండ్ ప్రభాస్ .. ది బిగ్గెస్ట్ అనౌన్స్ మెంట్ ఆఫ్ 2020.. అంటూ విడుదలైన ఈ వీడియో .. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి చిత్రాలను మాత్రమే డైరెక్ట్ చేసి ..  తన టాలెంట్ ఏ పాటిదో చాటుకున్న నాగ్ అశ్విన్  ఇప్పుడు ప్రభాస్ తో సినిమా తెరకెక్కించనుండడం  అందరినీ ఆకట్టుకుంటోంది. మరి నాగ్ అశ్విన్ ప్రభాస్ తో ఏ జోనర్  చిత్రాన్ని రూపొందిస్తాడో చూడాలి.

వీడియోను వీక్షించడానికి కింది లింక్ మీద క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?v=ReCOhdHGAQ8&feature=youtu.be

 

Leave a comment

error: Content is protected !!