అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ మూవీ హడావిడిలో ఉన్నాడు. ఈ వేలెంటైన్స్ డే కానుకగా .. ఇందులోని  మొదటి సింగిల్ విడుదల కానుంది. ఏప్రిల్ లో విడుదల కానున్న ఈ సినిమా తర్వాత చైతూ.. పరశురామ్ దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్  బ్యానర్ లో ఒక సినిమా కు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ‘గీత గోవిందం’ బ్లాక్ బస్టర్ తర్వాత ఆ స్థాయిలోనే ఒక మంచి స్టోరీని రెడీ చేశాడట పరశురామ్. ఈ సినిమాకి ‘నాగేశ్వరరావు’ అనే టైటిల్ కూడా దాదాపు ఖాయం చేశారని టాక్.

అయితే ఈ సినిమా హీరోయిన్ ఎవరు అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ‘గీత గోవిందం’ చిత్రం అద్భుత విజయం సాధించడానికి దోహద పడ్డ గీత పాత్రధారి రష్మిక మందణ్ణనే ఈ సినిమాలో మొదట కథానాయికగా అనుకున్నారు. అయితే తాజా సమాచారం  ప్రకారం కీర్తి సురేశ్ కథానాయికగా ఫిక్స్ అయినట్టు వార్తలొస్తున్నాయి. కథ ప్రకారం ఇందులో కథానాయిక గా బెస్ట్ పెర్ఫార్మర్ కావాలట. అయితే రష్మికా, కీర్తి ఇద్దరూ మంచి నటీమణులు కాబట్టి.. ఈ ఇద్దరి పేర్లు పరిశీలనలోకి వచ్చాయట. మరి ఇందులో కీర్తి కథానాయికగా ఫైనల్ అయితే.. ‘నాగేశ్వరరావు’ మూవీకి ఓ రేంజ్ లో క్రేజ్ వస్తుంది. ఫన్ ఫిల్డ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా చైతుకు ఏ రేంజ్ ఇమేజ్ తెచ్చిపెడుతుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!