ఇండియన్ స్ర్కీన్ పై స్పోర్ట్స్ పెర్సనాలిటీస్ పై బయోపిక్స్ తెరకెక్కడం ఇప్పుడు ట్రెండ్ గా మారింది. ప్రత్యేకించి బాలీవుడ్ లో ప్రస్తుతం ఆ తరహాలోనే  పలు బయోపిక్స్ తెర కెక్కుతున్నాయి. ఇప్పుడు టాలీవుడ్ కు ఆ మేనియా షిఫ్ట్ అయింది. సీనియర్ స్ర్కిప్ట్ రైటర్ కమ్ ప్రొడ్యూసర్ కోనవెంకట్ ..  ప్రముఖ  వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ కరణం మల్లీశ్వరి బయోపిక్ ను తెలుగుతెరకెక్కించే ప్రయత్నం లో ఉన్నారట.

రీసెంట్ గా కరణం మల్లీశ్వరిని కలుసుకున్న కోన వెంకట్ . ఆమె చేత ఆమోద ముద్ర వేయించుకోవడమే కాకుండా.. ఆ మేరకు రైట్స్ కూడా తీసుకున్నారట. పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా అతి త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళనుందని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలోనే రానుంది. అలాగే.. కరణం మల్లీశ్వరి గా ఎవరు నటిస్తారనే విషయం కూడా అప్పుడే రివీల్ కానుంది. 2000 ఒలింపిక్స్ లో వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ గా బ్రాంజ్ మెడల్ అందుకొని .. రాజీవ్ ఖేల్ రత్నా అవార్డు సొంతం చేసుకున్న ఆ తెలుగు కిరణంగా వెండితెరపై  ఎవరు మెరుస్తారో చూడాలి.

Leave a comment

error: Content is protected !!