మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు ఉగాది సందర్భంగా సోషల్ మీడియాలో తన ఖాతా ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. అందులో మొదటి ట్వీట్ ఉగాది శుభాకాంక్షలు , కరోనా జాగ్రత్తలు చెబుతూ.. మెగాస్టార్ ట్వీట్ చేశారు. ఆ తర్వాత తన తల్లితో ఒక సెల్ఫీ తీసి ..  కరోనా లాక్ డౌన్ సందర్భంగా ఇంటి దగ్గర ఉన్న తన ఫ్యాన్స్ ను ఉద్దేశిస్తూ..  ఇంటి దగ్గర మీ పెద్దల్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెబుతూ… మీరు కూడా మీ కుటుంబంతో సెల్ఫీ తీసుకొని పంపించమని చెప్పారు. దాంతో చాలా మంది తమ సన్నిహితులతోనూ, కుటుంబ సభ్యులతోనూ సెల్ఫీ తీసుకొని చిరు టైమ్ లైన్ లో  పోస్ట్ చేశారు. హోమ్ టైమ్.. మామ్ టైమ్ అంటూ ట్వీట్ చేసిన చిరంజీవి ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నారు.

Leave a comment

error: Content is protected !!