‘సాహో’ తర్వాత  భారతీయ ప్రేక్షకుల కళ్ళన్నీ ప్రభాస్ తదుపరి చిత్రం మీదే ఉన్నాయి. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ‘ఓ డియర్’ (ఈ టైటిల్ ఇంకా ఖాయం కాలేదు) చిత్రం ప్రస్తుతం సెట్స్ మీదున్న సంగతి తెలిసిందే. ఇందులో డార్లింగ్ హస్త సాముద్రిక పండితుడిగా సరికొత్త మేకోవర్ తో కనిపించనున్నాడు. అతడి సరసన అందాల పూజా కథానాయిక నటిస్తోన్న సంగతి తెలిసిందే. పీరియాడికల్ నేపథ్యంలోని రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో డిస్కోడాన్సర్ మిథున్ చక్రవర్తి విలన్ గా నటించనున్నట్టు తెలుస్తోంది.

పవర్ స్టార్ ‘గోపాలా గోపాలా’ చిత్రం లో లీలాధర స్వామిగా వెరైటీ గెటప్ లో , విచిత్రమైన హావభావాలతో నటించి మెప్పించిన ఆయన .. ఈ సినిమాలో కూడా ఆ తరహాలోనే ఒక స్వామిజీ లాంటి పాత్ర పోషిస్తున్నాడని టాక్. ప్రభాస్ కు , మిథున్ కు మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఆసక్తిగా ఉంటాయని తెలుస్తోంది. మిథున్ వారసుడు మహాక్షయ్ చక్రవర్తి హీరోగా టాలీవుడ్ లో రీసెంట్ గా  ఒక సినిమా లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. అది దృష్టిలో పెట్టుకొనే మిథున్ ప్రభాస్ కు విలన్ గా నటించడానికి ఆసక్తి చూపించాడట. త్వరలోనే దీని గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందట. మరి మిథున్ చక్రవర్తి విలనిజం .. ‘ఓ డియర్’ చిత్రానికి ఏ రేంజ్ లో హైలైట్ అవుతుందో చూద్దాం.

Leave a comment

error: Content is protected !!