అందాల అనుష్క మూగ, బధిర యువతిగా , తమిళ హీరో మాధవన్ ఆమె భర్తగా నటించిన హారర్ థ్రిల్లర్ ‘నిశ్శబ్దం’. ‘వస్తాడు నా రాజు’ ఫేమ్ హేమంత్ మధుకర్ దర్శకత్వంలో, కోన వెంకట్ సమర్పణలో  పీపుల్స్ మీడియా నిర్మిస్తోన్న ఈ ఇంటెన్స్ థ్రిల్లర్ ఏప్రిల్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమౌతోంది.  ఈ సందర్భంగా ఈ మూవీ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు నిర్మాతలు. అందులో భాగంగా ‘నిశ్శబ్దం’ ట్రైలర్  ను  విడుదల చేశారు.  అప్పుడే ఈ ట్రైలర్  కు యూ ట్యూబ్ లో 7మిలియన్స్ పైగానే వ్యూస్ వచ్చాయి.

1:25 నిమిషాల ప్రదర్శనా సమయం తో విడుదలైన ‘నిశ్శబ్దం’ ట్రైలర్ ..  ఒక  దెయ్యాల కొంప దాని చుట్టూ ఏదో మిస్టరీ. ఆ కేస్ ను ఇన్వెస్ట్ గేట్ చేసే అంజలి..  హాస్పిటల్ బెడ్ మీద స్వీటీ తాను చూసిన దృశ్యాల గురించి సైగలతో ఏదో వివరిస్తోంది. ఇంతలో ఎవరో మాస్క్ తో వరుసగా హత్యలు చేస్తుంటాడు.  హాలీవుడ్ యాక్టర్ మైకేల్ మేడ్ సన్ ఎంట్రీ. సమ్ థింగ్ ఏదో మిస్టరీ నిశ్శబ్దం చిత్రంలో దాగి ఉందని అర్ధమవుతుంది. టోటల్ గా ‘నిశ్శబ్దం’ చిత్రం ఆసక్తిని రేకెత్తించే థ్రిల్లర్ మూవీ అన్నమాట. మరి ఈ సినిమాతో అనుష్క ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో చూడాలి.

ట్రైలర్ వీక్షించడానికి కింది లింక్ మీద క్లిక్ చేయండి

https://www.youtube.com/watch?v=azUa-Qpi-Bo&feature=emb_logo

 

Leave a comment

error: Content is protected !!