మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా .. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన మాస్ మసాలా కాప్ మూవీ ‘క్రాక్’. శ్రుతి హాసన్ హీరోయిన్ గా, వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలో , సముద్రఖని విలన్ గా నటిస్తోన్న ఈ సినిమా మే 8న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకుంటోన్న ఈ సినిమాను బి.మధు నిర్మిస్తున్నారు. శివరాత్రి సందర్భంగా క్రాక్ సినిమా టీజర్ ను ఈ సాయంత్రం విడుదల చేశారు. క్రాక్ పోలీసాఫీసర్ గా  కిరాక్ పెర్ఫార్మెన్స్ తో మాస్ రాజా చెలరేగిపోయాడు. బుర్రా సాయిమాధవ్ డైలాగ్స్ రాస్తోన్న ఈ సినిమా కు యస్.యస్.తమన్ సంగీతం.

‘ఒంగోలులో రాత్రి 8 గంటలకు కరెంట్ పోయిందంటే.. మర్డర్ జరిగినట్టే’ అనే రవితేజ వాయిస్ మీద టీజర్ బిగిన్ అవుతుంది. నైట్ ఎఫెక్ట్ లో గూండాలతో రవితేజ ఫైట్స్ .. సముద్ర ఖని విలనిజానికి సంబంధించిన విజువల్స్ ..వరలక్ష్మి శరత్ కుమార్  విజిల్ వేయగానే బాంబ్ పేలడం .. ఇలా రకరకాల షాట్స్ మీద క్రాక్ టీజర్ ను కట్ చేశారు . ఈ టీజర్ ను చూస్తుంటే.. తమిళ ‘సేతుపతి’ ఛాయలు కనిపిస్తాయి. ముఖ్యంగా ’ఒరేయ్ అప్ప్గ్పిగా సుబ్బిగా  ,  నువ్వెవరైతే నాకేంట్రా టొప్పిగా ’ అనే రవితేజ ఒక మాస్ డైలాగ్ కొట్టడం..  సముద్రఖనిని బేడీలు వేసుకొని నడిపించుకు తీసుకెళ్ళడం..   .. ‘సేతుపతి’ సినిమానే గుర్తుకు వస్తుంది. ముందు నుంచీ ఈ సినిమాను  సేతుపతి స్టోరీతో డిఫరెంట్ స్ర్కీన్ ప్లేతో తెరకెక్కిస్తున్నారని లీక్స్ రావడం వల్ల ఆ సీన్స్ కు అంతగా  ఆశ్చర్యపోనక్కర్లేదు..  మెలితిప్పిన మీసాలతో క్రాక్ పోలీస్ గా రవితేజ స్టైలిష్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మరి  ఈ సినిమా మాస్ మహారాజా కు ఏ రేంజ్ లో క్రేజ్ తెస్తుందో చూడాలి.

క్రాక్ టీజర్ వీక్షించడానికి కింది లింక్ మీద క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?v=mgIzJtNxoAk&feature=youtu.be

 

 

 

Leave a comment

error: Content is protected !!