Shopping Cart 0 items - $0.00 0

‘జాన్’ కాదు ‘ఓ… డియర్’..?

సాహో’ తర్వాత డార్లింగ్ ప్రభాస్ నటిస్తోన్న రొమాంటిక్ యాక్షన్ మూవీ ప్రస్తుతం సెట్స్ మీదుంది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా లో ప్రభాస్ పామిస్ట్రీ పండితుడిగా సరికొత్తగా కనిపించనున్నాడట. నిజానికి  ఈ సినిమాకి ముందుగా అనుకున్న టైటిల్ ‘జాన్’.  దిల్ రాజు నిర్మిస్తోన్న తమిళ ‘96’ రీమేక్ చిత్రానికి జాను అనే టైటిల్ ఖాయం చేసిన సంగతి తెలిసిందే. ‘జాను’ లాగే ‘జాన్’ కూడా ధ్వనిస్తోంది కాబట్టి.. మైత్రీ మూవీస్ వారు ‘జాన్’ టైటిల్ ను పక్కన పెట్టి..  ‘ఓ డియర్, రాధేశ్యాం’ అనే రెండు టైటిల్స్ రిజిస్టర్ చేయించారట.

మైత్రీ మూవీస్ వారు త్వరలో మేర్లపాక గాంధీ దర్శకత్వంలోనూ, సుజిత్ దర్శకత్వంలోనూ రెండు చిత్రాల్ని నిర్మించబోతున్నారు. ఆ రెండూ ప్రస్తుతం స్ర్కిప్టింగ్ దశలో ఉన్నాయి. కాబట్టి.. ఈ రెండు టైటిల్స్ ఆ సినిమాల కోసం కాదని అర్ధమౌతోంది. సో.. మిగిలింది ప్రభాస్ మూవీనే కాబట్టి.. ఓ డియర్ , రాధే శ్యాం లో ఒక టైటిల్ కచ్చితంగా ఖాయం చేస్తారని వినికిడి. అయితే కథను బట్టి.. మూడొంతులు ‘ఓ డియర్’ టైటిలే ఫిక్స్ చేస్తారని చెప్పుకుంటున్నారు. ప్రభాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ఈ ఏడాది ద్వితీయార్ధంలో విడుదల కానుంది.

Leave a comment

error: Content is protected !!