Shopping Cart 0 items - $0.00 0

చిరంజీవి, మహేశ్ లపై కన్నేశాడట

 

చిన్న సినిమాలతో ఇండస్ట్రీలో పేరు తెచ్చుకొని .. ఆతర్వాత పెద్ద స్టార్సైన చిరు,  మహేశ్ బాబు, యన్టీఆర్, రామ్ చరణ్ లతో సినిమాలు తీసి తన రేంజ్ ను పెంచుకున్న దర్శకుడు శ్రీనువైట్ల. ఇప్పుడు తన ఫామ్ ను పూర్తిగా కోల్పోయి.. చేతిలో ఒక్క సినిమా కూడా లేకుండా అయిపోయాడతడు. వరుస ఫ్లాప్స్ పలకరిస్తున్నప్పటికీ… పెద్ద చేపలకు గాలం వేయడం మాత్రం మానలేదు మనోడు. ఇప్పుడు శ్రీను దృష్ణి మెగా స్టార్ చిరంజీవిపైనా, సూపర్ స్టార్ మహేశ్ పైనా పడిందని టాక్.

మొన్నీమధ్య మహేశ్ బాబు కు కథ వినిపించాడని వార్తలొచ్చాయి. అంతలోనే మెగాస్టార్ చిరుకు కూడా రీసెంట్ గా ఒక కథ వినిపించాడని తెలుస్తోంది. ఈ ఇద్దరితోనూ శ్రీను గతంలో సినిమాలు చేశాడు. అందులో మహేశ్ బాబుతో ‘దూకుడు’ లాంటి ఒక బ్లాక్ బస్టర్ కొట్టాడు. కానీ చిరంజీవి ‘‘అందరివాడు’’ యావరేజ్ మార్కులు మాత్రమే వేయించుకుంది. అయినా సరే.. ఇద్దరిలో ఎవరో ఒకరు మరో ఛాన్సిస్తారని మనోడి నమ్మకమట. ప్రస్తుతం అతడి ట్రాక్ రికార్డు ను బట్టి అయితే.. ఆ ఇద్దరూ శ్రీనును మళ్ళీ అక్కున చేర్చుకొనే పరిస్థితి అయితే లేదు. ఖచ్చితం గా ఆ ఇద్దరూ శ్రీను వైట్లను కొన్ని రోజులు తిప్పించుకొని సారీ చెప్పే అవకాశాలయితే ఉన్నాయని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. మరి అప్పుడు  శ్రీను వైట్ల తక్షణ కర్తవ్యం ఏంటో చూడాలి.

Leave a comment

error: Content is protected !!