Shopping Cart 0 items - $0.00 0

గీతా ఆర్ట్స్ కాంపౌండ్ లోకి మహేశ్ బాబు

ఈ ఏడాది సంక్రాంతి వార్ లో మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లువారబ్బాయ్ ‘అల వైకుంఠపురములో’ చిత్రాలు  పోటా పోటీ గా తలపడిన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలూ బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో మ్యాజిక్ చేసి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి. ప్రొఫెనల్ గా బన్నీకి పోటీ ఇచ్చిన మహేశ్ బాబు వ్యక్తిగతంగా అల్లు ఫ్యామిలీతో మంచి రిలేషన్ మెయిన్ టెయిన్ చేస్తుంటాడు.  అది బేస్ చేసుకొనే ఇప్పుడు మహేశ్ బాబు గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఒక సినిమా చేయాలనుకుంటున్నాడట. గతంలో అల్లు అరవింద్ .. ‘గీత గోవిందం’ తర్వాత పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ బాబు తో ఒక సినిమా చేయాలని ప్రయత్నించాడు. కానీ ఆ కథ నచ్చక మహేశ్ బాబు సున్నితంగా తిరస్కరించాడు. కానీ ఇప్పుడు మళ్ళీ అరవింద్ కు ఒక సినిమా  చేసే అవకాశాన్ని తనకు తానుగానే ఇచ్చినట్టు తెలుస్తోంది.

అదెలా జరిగిందంటే.. ‘కేజీయఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ .. రీసెంట్ గా మహేశ్ బాబుకు ఒక అదిరిపోయే స్ర్కిప్ట్ నెరేట్ చేశాడట. ఆ కథకు బాగా ఇంప్రెస్ అయిన మహేశ్ .ఆ కథను అరవింద్ కు చెప్పమని కోరాడట. ప్రశాంత్ నీల్ స్టోరీకి ఫ్లాట్ అయిపోయిన అరవింద్ .. త్వరలోనే సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడట. ప్రస్తుతం మహేశ్ .. వంశీ పైడిపల్లి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ మూవీ కంప్లీట్ కాగానే.. ప్రశాంత్ నీల్ సినిమాకు షిఫ్ట్ అవుతాడట. అన్నీ కుదిరితే ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది కార్యరూపం దాల్చనుందని వినికిడి. మరి గీతా ఆర్ట్స్ లోనే ఈ ప్రాజెక్ట్ ఖాయం అవుతుందో లేదో చూడాలి.

 

Leave a comment

error: Content is protected !!