‘కూలి నెం. 1’ తో టాలీవుడ్ లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ అందాల భామ టబు. ఆపై  ‘నిన్నే పెళ్ళాడుతా’ చిత్రంతో నాగ్ తో రొమాన్స్ చేసి కుర్రకారు గుండెల్లో గుబులు రేపింది. తర్వాత కాలంలో అప్పట్లో టాలీవుడ్ టాప్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. అటు బాలీవుడ్లోనూ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు  ఈ సినియర్ భామ.. రీ ఎంట్రీతో  మరింత ప్రత్యేకంగా మారిపోయింది. ముఖ్యంగా ‘అల…వైకుంఠపురములో బన్నీకి తల్లిగా నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ క్రెడిట్ తోనే  ఇప్పుడు సౌత్ లో కాస్ట్ లీ కేరక్టర్ ఆర్టిస్ట్ అయిపోయింది.  

టబును ప్రత్యేక పాత్రల్లో తీసుకోవాలని ఉబలాట పడుతోన్న నిర్మాతలకు ఆమె గారి డిమాండ్ కు చుక్కలు కనబడుతున్నాయట. అమ్మడు ఏకంగా కోటికి తక్కువ లేకుండా పారితోషికం డిమాండ్ చేస్తూండడంతో బడా ప్రొడ్యూసర్స్  సైతం  ఆలోచనలో పడుతున్నారట. ఆమె గారు అంత డిమాండ్ చేయకపోతే.. మరిన్ని మంచి పాత్రలు ఆమెను వరిస్తాయని చర్చించుకుంటున్నారు. అయినా సరే.. టబు మేడమ్ .. కోటి అంటే కోటి రూపాయలు ఇచ్చుకోవాల్సిందే అంటూ భీష్మించుకు కూర్చుంటోందట.  మరి ఆవిడగారు ఇలాగే.. మంకు పట్టు పడితే.. తెలుగు సినిమాల్లో కనిపించడం కష్టమే అనుకుంటున్నారు. మరి టబు ఒక మెట్టు దిగి వస్తుందో లేదో చూడాలి.

Leave a comment

error: Content is protected !!