Shopping Cart 0 items - $0.00 0

కాజల్ ను రీప్లేస్ చేస్తుందా?

 

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ చిత్రం రోజుకో అప్డేట్ తో అభిమానుల్ని ఊరిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో కథానాయిక పాత్ర ఎవరూ అనే విషయంలో కొంత సందిగ్ధత నెలకొని ఉంది. ముందుగా త్రిషా కృష్ణన్ కథానాయిక అని ప్రచారం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుంచి తను తప్పుకుంటున్నట్టు ప్రకటించి దర్శకనిర్మాతలకు షాకిచ్చింది. దాంతో ఆమె ప్లేస్ ను కాజల్ అగర్వాల్ భర్తీ చేయనుందనే వార్తలు వినిపించాయి.

‘ఖైదీ నెం. 150’ లో చిరు తో ఓ రేంజ్ లో ఆన్ స్ర్కీన్ కెమిస్ట్రీ పండించి అభిమానుల ఆదరణను చూరగొంది కాజల్ అగర్వాల్. ఇప్పుడు మరోసారి చందమామ చిరుతో జోడీ కడుతోంది అనగానే.. దాన్నో పాజిటివ్ సెంటిమెంట్ గా తీసుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం  ఆచార్యలో కాజల్ అగర్వాల్ నటించడం డౌటే అంటున్నారు సినీ వర్గాల వారు. అమ్మడు చాలా ఎక్కువగా పారితోషికం డిమాండ్ చేయడంతో .. ఆమె కన్నా అందంలోనూ, అభినయంలోనూ అన్నివిధాలుగానూ అనుష్క శెట్ట్టినే బెటరని భావిస్తున్నారట మేకర్స్. ముఖ్యంగా చిరు  కూడా అనుష్క పట్ల సుముఖంగా ఉన్నారని వార్తలందుతున్నాయి. గతంలో చిరంజీవి స్టాలిన్ లో ఒక పాటలో మెరిసిన అనుష్క, మరోసారి సైరా చిత్రంలో ఝాన్సీ లక్ష్మి బాయ్ పాత్రలో మెప్పించింది. ఇప్పుడు ఆచార్యలో అమ్మడు ఏకంగా కథానాయికగా నటిస్తూండడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. మరి ‘ఆచార్య’లో చిరు, అనుష్క జోడీ ఏ రేంజ్ లో మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

 

Leave a comment

error: Content is protected !!