Shopping Cart 0 items - $0.00 0

కరోనా పై యుద్ధానికి సురేశ్ ప్రొడక్షన్స్ విరాళం

 

ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నిటినీ గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనాపై యుద్ధానికి యావ‌త్ భార‌త‌దేశం న‌డుం బిగించింది. దేశ  ప్ర‌ధాని మోడీ ప్ర‌క‌ట‌న మేర‌కు 21 రోజులు పాటు ప్ర‌జ‌లంతా ఇళ్ళకే  పరిమ‌త‌మ‌వ్వ‌డానికి సిద్ధ‌మైయ్యారు. ఈ నేప‌థ్యంలో ఎటువంటి ప‌నులులేక ఇల్లు గడిచే పరిస్థితి లేక పేద దిగువ మధ్యతరగతి కుటుంబాల వారు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే వారిని ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు ప్యాకేజీలను ప్రకటించడం జరిగింది. అలానే ఎందరో ధైర్యంగా మన గురించి పని చేస్తున్నారు.

ఇక ఇలాంటి విప‌త్తులు వ‌చ్చిన ప్ర‌తిసారీ సాయానికి చిత్ర ప‌రిశ్ర‌మ ఎప్పుడూ ముందుంటుంది. ఈ పంధాలోనే తాజాగా క‌రోనా పై పోరాటానికి సంబంధించిన కార్య‌క్ర‌మాలకు త‌న వంతు బాధ్య‌త‌గా దగ్గుబాటి వారి ఫ్యామిలీ కూడా భారీ విరాళాన్నే ప్రకటించింది. ఇండస్ట్రీలో పనిచేసే కార్మికులకు , ఆసుపత్రి లో పనిచేసే కార్మికులకు సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ, దగ్గుబాటి వెంకటేశ్,రానా దగ్గుబాటి కలిసి రూ. 1కోటి విరాళం ప్రకటించారు.

Leave a comment

error: Content is protected !!