కరోనా రక్కసి కోరలు సాచి ప్రపంచాన్నే ఒణికిస్తోన్న సంగతి తెలిసిందే. దాని ప్రభావంతో దేశ: మొత్తం  లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది.  మొత్తం 21 రోజుల లాక్ డౌన్‌తో జనమే కాదు రోజువారి కూలీలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో రోజువారి పని చేసే వాళ్లు చాలా మంది ఉంటారు. పొద్దున్నే షూటింగ్‌కు వచ్చి సాయంత్రానికి వాళ్లు డబ్బులు తీసుకుని వెళ్లిపోతుంటారు. అలాంటి వాళ్లకు ఇప్పుడు పనులతో పాటు చేతిలో డబ్బులు కూడా లేని పరిస్థితి. అలాంటి వాళ్లను ఆదుకోవాల్సిన బాధ్యత తీసుకుంటున్నారు మన హీరోలు. ఒక్కొక్కరుగా ముందుకొచ్చి సాయం చేస్తున్నారు. ఇప్పుడు నాగార్జున కూడా కోటి రూపాయాలను సినీ కార్మికుల కోసం విరాళంగా అదించారు.

షూటింగ్స్ లేక ఇబ్బంది పడుతున్న రోజు వారీ సినీ కార్మికుల కోసం తన వంతుగా ఈ మొత్తాన్ని ఇస్తున్నట్లు తెలిపాడు కింగ్ నాగార్జున. ఈ లాక్ డౌన్ మనకి అత్యంత అవసరమని.. అందరూ ఇంటిలోనే ఉండి విధిగా దాన్ని పాటించాలని పిలుపునిచ్చాడు కింగ్. కాగా అక్కినేని కుటుంబం నుంచి నాగార్జున ఒక్కడే ఇచ్చాడు.. మరి చైతూ, అఖిల్ ఏం చేస్తారో చూడాలిక.

Leave a comment

error: Content is protected !!