కరోనా వైరస్ ఇప్పుడు 195 దేశాలకు పైగా వ్యాపించి ఇప్పుడు ఇండియాలోనూ తిష్టవేసుకు కూర్చున్న సంగతి తెలిసిందే.  దాంతో  ఈ వైరస్ ని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ శక్తికి మించి ప్రయత్నిస్తున్నాయి. ఇక భారత ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్డౌన్ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే..  కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకి చిత్ర పరిశ్రమలోని సినీ ప్రముఖులు అండగా నిలుస్తున్నారు.. ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమ నుండి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నాలుగు కోట్ల విరాళం ఇవ్వగా, చిరంజీవి రూ.1 కోటి, పవన్ కళ్యాణ్ రెండు కోట్ల విరాళం, రామ్ చరణ్ 75 లక్షలు, ఎన్టీఆర్ 75 లక్షలు, అల్లుఅర్జున్ కోటి 25 లక్షల విరాళం ఇచ్చారు.

ఇప్పుడు ఆ లిస్ట్ లోకి నందమూరి నట సింహ బాలకృష్ణ కూడా చేరారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 50లక్షలు విరాళం ప్రకటించిన బాలయ్య అదే చేత్తో కరోనా క్రైసిస్ చారిటీ కోసం రూ. 25లక్షలు విరాళంగా ఇచ్చారు. మొత్తం రూ. 1.25 కోట్లు చెక్ ను సిసిసి ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయిన సి.కళ్యాణ్ కు అందించారు. దాంతో బాలకృష్ణ దాత్రుత్వానికి చిరంజీవి కృతజ్నతలు తెలుపుతూ.. సంతోషం వ్యక్తం చేశారు.

Leave a comment

error: Content is protected !!