ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న కరోనా వైరస్  కార‌ణంగా సినీ ప‌రిశ్ర‌మ‌లో నిరాశ్ర‌యిలైన వారికి ఆదుకునేందుకు క‌రోనా క్రైసిస్ ఛారిటీని ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే.  మెగాస్టార్ చిరంజీవి నాయకత్వంలో రూపుదిద్దుకున్న ఈ ట్రస్ట్ కు  ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు ఆరు కోట్ల‌కి పైగా విరాళాలు అందించారు. తాజాగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది రూ.5 ల‌క్ష రూపాయ‌లు విరాళం అందిస్తున్న‌ట్టు ప్రకటించాడు.

ప్ర‌పంచం ఇలాంటి విపత్క‌ర ప‌రిస్థితులని ఎదుర్కొంటుంద‌ని అస్స‌లు ఊహించ‌లేదు. ఇలాంటి స‌మ‌యంలో ఒక‌రికి ఒక‌రం తోడుగా ఉండాలి. నా వంతు బాధ్య‌త‌గా రూ. 5ల‌క్షల విరాళాన్ని క‌రోనా క్రైసిస్ ఛారిటీకి అందిస్తున్నాన‌ని సంప‌త్ నంది పేర్కొన్నారు.  గ‌త కొద్ది రోజులుగా గోపిచంద్ మూవీతో బిజీగా ఉన్న సంప‌త్ నంది లాక్ డౌన్ కార‌ణంగా ఇంటికే ప‌రిమిత‌మయ్యారు.

 

Leave a comment

error: Content is protected !!