కరోనా వైరస్ భయంతో ప్రపంచమంతా ఒణికిపోతున్న సంగతి తెలిసిందే. దాంతో ఇండియా మొత్తం కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ నియమాలకు కట్టుబడి లాక్ డౌన్ ను ఫాలో అవుతోంది. ఇక కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య ఇండియాలో కూడా భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ నివారణ కోసం బడా వ్యాపార వేత్తలు సినీ ప్రముఖులు పెద్ద మనసుతో విరాళాలు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు.  ఇప్పటికే ఎంతో మంది సినీ స్టార్స్  తమ తమ స్థాయికి తగ్గట్టుగా భూరి విరాళాలిచ్చారు. ఇప్పుడు  టాలీవుడ్ యంగ్ హీరో .. శర్వానంద్ కూడా తనకు చేతనైన సహాయం చేయడానికి ముందుకొచ్చాడు.

కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా సినీ పరిశ్రమలో బాధలు పడుతోన్న రోజు కూలీల సంక్షేమార్ధం మెగాస్టార్ చిరంజీవి ఇటీల స్థాపించిన కోరోనా క్రైసిస్ చారిటీ సంస్థకు శర్వానంద్ రూ. 15 లక్షలు విరాళం ప్రకటించాడు. ఆ విషయాన్ని తన ట్విట్టర్ పేజ్ లో తెలియచేశాడు.

Leave a comment

error: Content is protected !!