కరోనా వైరస్ భయంతో ప్రపంచమంతా ఒణికిపోతున్న సంగతి తెలిసిందే. దాంతో ఇండియా మొత్తం కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ నియమాలకు కట్టుబడి లాక్ డౌన్ ను ఫాలో అవుతోంది. ఇక కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య ఇండియాలో కూడా భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ నివారణ కోసం బడా వ్యాపార వేత్తలు సినీ ప్రముఖులు పెద్ద మనసుతో విరాళాలు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు.  ఇప్పటికే ఎంతో మంది సినీ స్టార్స్  తమ తమ స్థాయికి తగ్గట్టుగా భూరి విరాళాలిచ్చారు. ఇప్పుడు  టాలీవుడ్ యంగ్ హీరో .. విష్వక్ సేన్ కూడా తనకు చేతనైన సహాయం చేయడానికి ముందుకొచ్చాడు.

ఈ రోజు విష్వక్ సేన్ తన  పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకొని మెగాస్టార్ చిరంజీవి  స్థాపించిన కరోనా క్రైసిస్ చారిటీ కి తన వంతు విరాళంగా రూ. 5లక్షలు విరాళం ఇస్తున్నట్టు తన ట్విట్టర్ పేజ్ లో ప్రకటించాడు.

Leave a comment

error: Content is protected !!