ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది  కరోనా మహమ్మారి. దీనికోసం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ నివారణా చర్యలు చేపట్టాయి. అందులో తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు తమ వంతు కృషి తాము చేస్తున్నాయి. అయితే  ఆ రెండు ప్రభుత్వాలకు తన వంతు సహాయంగా  టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ రూ. 10లక్షల విరాళం ఇస్తున్నట్టు ప్రకటించి మిగతా హీరోల్లో చైతన్యం తీసుకొచ్చాడు.

దీంతో సోషల్ మీడియాలో నితిన్ పై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. నితిన్ అందరికీ స్ఫూర్తి అని అందరూ అతడ్ని తెగ పొగిడేస్తున్నారు. కరోనా కేసులు రాష్ట్రంలో రోజు రోజుకూ పెరుగుతుండడంతో… తెలంగాణా ప్రభుత్వం మార్చ్ 31 వరకూ లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి తన వంతు సహాయం అందించడానికి ముందుకొచ్చిన నితిన్ ఎంతైనా అభినందనీయుడు .

Leave a comment

error: Content is protected !!