ప్రపంచ దేశాల్ని గజగజ వణికిస్తోంది కరోనా వైరస్. అన్ని రంగాల్లోనూ దాని ప్రభావం విపరీతంగా ఉంది. ఇక సినీ పరిశ్రమ విషయానికొస్తే.. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ అన్ని వుడ్స్ లోనూ దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడంలో నిమఘ్నమై ఉన్నారు. కొద్ది రోజుల పాటు థియేటర్స్ మూసివేయబోతున్నారు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో  బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్..  వీక్లీ వన్స్ ముంబై లోని జల్సా గేట్ వద్ద  తన ఫ్యాన్స్ ను కలిసే కార్యక్రమం సండే మీట్ కు ఈ సారి నో చెప్పారు. ఫ్యాన్స్  ను కరోనా వైరస్ పై జాగ్రత్తలు పాటించండని పిలుపునిస్తూ.. తాను ఈ సారి జల్సా గేట్ వద్దకు రావడం లేదని చెప్పారు.

ఈ రోజు తన ట్విట్టర్ అకౌంట్లో బిగ్ బీ ఈ విషయాన్నిఫ్యాన్స్ కు  తెలియచేశారు. దానితో పాటు ఒక మఫ్లర్ చుట్టుకొని బ్యాండేజ్ వేసుకున్న తన పిక్ ను కూడా పోస్ట్ చేశారు. కొద్దిరోజులకు ముందు చాలా మంది కరోనా వైరస్ కు విరుగుడుగా కలోంజీ పౌడర్ ను, ఆల్మా జ్యూస్ ను తీసుకుంటున్నట్టు చెప్పి.. అయినా సరే ఎవరీ షేక్ హ్యాండ్స్ ఇవ్వొద్దని , ఒక వేళ ఇచ్చినా సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని జాగ్రత్తలు చెప్పారు.   అమితాబ్ పెట్టిన ఈ ట్వీట్ బాలీవుడ్ లో అందరిలోనూ ఒక అవేర్ నెస్ ను తీసుకొస్తోంది. మిగతా నటీనటులు ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని తమ ఫ్యాన్స్ ను కలిసే కార్యక్రమాన్ని కొద్ది రోజులు వాయిదా వేసుకుంటారేమో చూడాలి.

Leave a comment

error: Content is protected !!