కరోనా వైరస్ భయంతో ప్రపంచమంతా ఒణికిపోతున్న సంగతి తెలిసిందే. దాంతో ఇండియా మొత్తం కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ నియమాలకు కట్టుబడి లాక్ డౌన్ ను ఫాలో అవుతోంది. ఇక కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య ఇండియాలో కూడా భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ నివారణ కోసం బడా వ్యాపార వేత్తలు సినీ ప్రముఖులు పెద్ద మనసుతో విరాళాలు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు.  ఇప్పటికే ఎంతో మంది సినీ స్టార్స్  తమ తమ స్థాయికి తగ్గట్టుగా భూరి విరాళాలిచ్చారు. 

ఇక కరోనా కట్టడికి మెగాస్టార్ చిరంజీవి అయితే తన  ఆధ్వ‌ర్యంలో క‌రోనా క్రైసిస్ చారిటీ మ‌న‌కోసం అనే సంస్థ‌ను ఏర్పాటు చేశారు. తాజాగా కరోనాపై స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశారు. ‘నీ చేతల్లోనే కదా భవిత’.. అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్‌ను మ్యూజిక్ డైరెక్టర్ కోటి కంపోజ్ చేయగా శ్రీనివాస్ మౌళి లిరిక్స్ అందించారు. ఈ వీడియో సాంగ్‌లో చిరంజీవి, నాగార్జున, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, కోటి నటించారు. ‘లెట్స్ ఫైట్ దిస్ వైరస్’ అంటూ ప్రజలను చైతన్యపరిచేలా ఉన్న ఈ పాట విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Leave a comment

error: Content is protected !!