కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు పైగా వ్యాపించి ఇప్పుడు ఇండియాలోనూ తిష్టవేసుకు కూర్చున్న సంగతి తెలిసిందే.  దాంతో  ఈ వైరస్ ని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ శక్తికి మించి ప్రయత్నిస్తున్నాయి. ఇక భారత ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్డౌన్ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే..  కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకి చిత్ర పరిశ్రమలోని సినీ ప్రముఖులు అండగా నిలుస్తున్నారు.. ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి పలువురు స్టార్ హీరోలు, దర్శక నిర్మాతలు  ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకి తమ విరాళాలు అందచేసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఆ లిస్ట్ లోకి యస్.ఆర్.టీ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ అధినేత (డిస్కోరాజా నిర్మాత)  రామ్ తాళ్ళూరి కూడా చేరారు. తెలంగాణా ముఖ్యమంత్రి సహాయనిధికి ఆయన రూ. 5లక్షల విరాళాన్ని, అలాగే.. మరో రూ.50లు సినీ వర్కర్స్ నిత్యావసర వస్తువులు కోసం అందించారు. మొత్తం మీద రామ్ తాళ్ళూరి రూ.5.5 లక్షల విరాళాన్ని ప్రకటించడం విశేషం.

 

Leave a comment

error: Content is protected !!