ఇండియన్  లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ లో తెరకెక్కుతోన్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘83’. రణవీర్ సింగ్ కపిల్ దేవ్ పాత్రను పోషిస్తుండగా..ఆయన భార్య రోమీ భాటియా పాత్రలో దీపికా పదుకొణే నటిస్తోంది. కాగా ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా ఔట్ బ్రేక్ కారణంగా ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించింది.

ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో ప్రతీ ఒక్కరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని 83 సినిమా విడుదలను నిలిపి వేస్తున్నాం. పరిస్థితులు మెరుగు పడిన తర్వాత సినిమా విడుదలపై నిర్ణయం తీసుకుంటాం. కరోనా నివారణకు తగిన జాగ్రత్తలు పాటించాల్సింది గా అభిమానులకు సూచిస్తున్నాం. కష్టాల్ని ఎదుర్కొని విజయం సాధించడమే మా 83 చిత్ర కథ. అలాగే మనం కూడా ఈ కరోనా కష్టం నుంచి బైట పడతామని ఆశిస్తున్నాం అని చిత్రం యూనిట్ తెలియచేసింది.

Leave a comment

error: Content is protected !!