లోకనాయకుడు కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘ఇండియన్ 2’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో ఒక స్టూడియో లో షూటింగ్ జరుపుకుంటోంది. కాగా ఈ సెట్స్ లో నిన్న ఘోరప్రమాదం జరిగింది. లైటింగ్ వేస్తుండగా.. 150 అడుగుల ఎత్తునుంచి ఒక్క సారిగా క్రేన్ తెగిపడింది.  ఈఘటన లో స్పాట్ లో ముగ్గురు మృతి చెందారు. పది మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షత్రగాత్రుల్ని చెన్నైలోని ఒక ఆసుపత్రికి తరలించారు.

చనిపోయిన వారిలో శంకర్ సహాయకుడు (మధు), అసిస్టెంట్ డైరెక్టర్ (సాయికృష్ణ ), మరొకరు ఉన్నారు.  సంఘటన జరగడానికొ కొద్ది నిమిషాలకు ముందే  కమల్ హాసన్.. శంకర్ సెట్స్ పనులను పర్యవేక్షించి వెళ్లారు. వాళ్లు  వెళ్లిన వెంటనే ఈ ఘోరం చోటు చేసుకుంది. లేదంటే పెద్ద విషాదమే చోటు చేసుకునేది. ఈ ఘటనపై కమల్ హాసన్ ట్విటర్లో స్పందించారు. “ఈ ఘటన నా మనసు కలచి వేసింది. ముగ్గురు సహాయకులను కోల్పోయాం. నా బాధ కన్నా వారి కుటుంబాల్లో చోటు చేసుకున్న బాధ ఎన్నో రెట్లు ఎక్కువ“ అంటూ వాపోయారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

Leave a comment

error: Content is protected !!