టాలీవుడ్ లో హీరోగా తనదైన శైలిలో దూసుకుపోతోన్న హీరో శర్వానంద్. జయాపజయాలతో సంబంధం లేకుండా.. ఎప్పటికప్పుడు తన సినిమాలతో ది బెస్ట్ పెర్ఫార్మర్ అనిపించు కుంటున్నాడు శర్వా. ఇటీవల ‘జాను’ ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటైన మీడియా ఇంటరాక్షన్ లో శర్వానంద్ .. ఒక షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఇకనుంచి తాను బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ను ఫాలో అవుతానని .. ఆయన సిద్ధాంతం ప్రకారం సంవత్సరానికి మూడు నాలుగు చిత్రాలతో క్వాలిటీ ఔట్ పుట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

సినిమాలు చేయడంలో .. బాలీవుడ్ హీరోలు అందరిలో కన్నా రాశిలోనూ, వాసిలోనూ ది బెస్ట్ అనిపించుకుంటున్నాడు అక్షయ్ కుమార్. 2016 నుంచి ఈ హీరో ఖాతాలో మొత్తం 11 హిట్స్ నమోదయ్యాయి. ప్రత్యేకించి 2019 లో అయితే రికార్డ్ స్థాయిలో మూడు సినిమాలు సూపర్ హిట్టయ్యాయి. ‘కేసరి, మిషన్ మంగళ్, హౌస్ ఫుల్ 4’ చిత్రాలతో వరుస విజయాలు సాధించి సత్తా చాటుకున్నాడు. అలా సినిమాల పరంగా  ఆయన అడుగుజాడల్లోనే నడవాలని శర్వా నిర్ణయించుకోవడం ఎంతైనా అభినందనీయం. ప్రస్తుతం టాలీవుడ్ లో సంవత్సరానికి ఒకే ఒక్క సినిమాలో మాత్రమే నటిస్తోన్న మిగతా హీరోలకన్నా తాను ఈ రకంగా కూడా చాలా భిన్నమని చాటుకున్నాడు శర్వానంద్. ఇటీవల జాను మూవీతో ప్రేక్షకుల్ని పలకరించిన శర్వానంద్.. మరో రెండు నెలల్లోనే ‘శ్రీకారం’ చిత్రంతో వస్తున్నాడు. దటీజ్ శర్వానంద్.

Leave a comment

error: Content is protected !!