Shopping Cart 0 items - $0.00 0

సింగర్ గా కుమారి

 

టాలీవుడ్ లో అగ్ర కథానాయికగా సెటిల్ అవ్వాలనే కోరికను హెబ్బా పటేల్ ఇప్పటి వరకూ తీర్చుకోలేకపోయింది.  పలు చిత్రాల్లో నటిస్తున్నా .. అవన్నీ సెకండ్ హీరోయిన్ కేటగిరిలోకి చేరడంతో అమ్మడు .. మరో రూట్లోకి ఇప్పుడు ట్రావెల్ అవుతోంది. హెబ్బా పటేల్ కి రీసెంట్ గా ఒక వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్ర చేయడానికి డీల్ కుదిరింది. చైతూ నటించిన ‘దడ’ దర్శకుడు అజయ్ భుయాన్ తెరకెక్కిస్తోన్న ఇంకా పేరు పెట్టని వెబ్ సిరీస్ లో కుమారి సింగర్ గా నటిస్తోంది.  ఆ వెబ్ సిరీస్ ను దర్శకుడు క్రిష్ నిర్మిస్తుండడం ఆసక్తి రేపుతోంది.

నవదీప్, చాందిని చౌదరి, బిందు మాధవి ప్రధాన పాత్రలు పోషిస్తోన్న ఈ వెబ్ సిరీస్ లో హెబ్బా పటేల్ ఒక లైవ్ బాండ్ లో సింగర్ గా నటిస్తోంది. అమ్మడి మీద ఒక సాంగ్ కూడా చిత్రీకరిస్తున్నారట. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకొన్న వెబ్ సిరీస్ త్వరలోనే ఒక టాప్ డిజిటల్ ప్లాట్ ఫామ్ మీద స్ట్రీమ్ అవనుందని సమాచారం.  ప్రస్తుతం నితిన్ ‘భీష్మ’లోనూ, రాజ్ తరుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా’ లోనూ  నటిస్తోన్న హబ్బా పటేల్ కు ఈ వెబ్ సిరీస్ ఏ రేంజ్ లో హెల్ప్ అవుతుందో చూడాలి.

 

Leave a comment

error: Content is protected !!