కరోనా వైరస్ భయంతో ప్రపంచమంతా ఒణికిపోతున్న సంగతి తెలిసిందే. దాంతో ఇండియా మొత్తం కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ నియమాలకు కట్టుబడి లాక్ డౌన్ ను ఫాలో అవుతోంది. ఈ నేపథ్యంలో రాజు నుంచి పేద వరకూ,  సాధారణ ప్రజానీకం నుంచి సినీ సెలబ్రిటీస్ వరకూ అందరూ ఇంటికే పరిమితమయ్యారు.  

అందులో పలువురు అందరినీ ఇంట్లోనే క్షేమంగా ఉండాలని కోరుకుంటూ.. ఇంట్లో ఉండి తాము చేసే కొన్ని ప్రయోజనకరమైన పనుల్ని సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేస్తున్నారు. అందులో యంగ్ హీరో సుశాంత్  ఒకరు. సుశాంత్  లాక్ డౌన్ ను పురస్కరించుకొని ఇంట్లోనే ఉంటూ… సవ్యసాచిలా   రెండు చేతులతోనూ రాయడం ప్రాక్టీస్ చేసి .. తాను అలా రాసింది చూపించి అందరినీ ఆకటట్టుకుంటున్నాడు. తన పేరును రెండు చేతులతోనూ రాసి చూపించి.. ఆ వీడియోను  ట్విట్టర్  లో పోస్ట్ చేశాడు.

Leave a comment

error: Content is protected !!