చిత్రలహరి, ప్రతిరోజూ పండగే’ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఖాతాలో వేసుకున్నాడు సాయిధరమ్ తేజ . ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటర్ చిత్రంలో నటిస్తున్నాడు. సుబ్బు దర్వకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా మే 1న విడుదల కాబోతోంది. ఇదిలా ఉంటే.. సాయి తదుపరి చిత్రం మీద ఒక వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చెక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం సాయిధరమ్ తేజ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా చేయబోతున్నాడట. వీరూ పోట్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా శ్రీకృష్ణ దేవరాయలు కాలంలో ట్రావెల్ అవుతుందట. అనిల్ సుంకర నిర్మాణ సారధ్యంలో రూపొందనున్న ఈ సినిమా బడ్జెట్ కూడా చాలా భారీ ఎత్తునే ఉండబోతున్నట్టు టాక్.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి దాదాపు రూ. 40కోట్లు బడ్జెట్ కేటాయించనున్నారట. మార్చ్ లో రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళనున్న ఈ సినిమా అనౌన్స్ మెంట్ త్వరలోనే రానుంది. హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు.. వీరూ స్టైలాఫ్ ఎంటర్ టైన్ మెంట్ కూడా ఇందులో ఉండనున్నాయట. గతంలో బాలకృష్ణ ‘ఆదిత్య 369’ కోసం, శ్రీకాంత్ ‘దేవరాయ’ కోసం రాయల వారి కాలంలోకి వెళ్ళారు. మరి ఈ సారి శ్రీకృష్ణదేవరాయలు కాలంలోకి  సాయిధరమ్ తేజ ఏ రేంజ్ లో ట్రాన్స్ ఫార్మ్ అవుతాడో చూడాలి.

Leave a comment

error: Content is protected !!