పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్’ చిత్రం ప్రస్తుతం సెట్స్ మీదున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు , బోనీకపూర్ సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా.. నిజానికి  మే 15న  రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం కరోనా వైరస్ ఔట్ బ్రేక్ కారణంగా ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. ఇండియా లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా  నమోదు అవుతుండడంతో.. తెలంగాణా ప్రభుత్వం మరో రెండు వారాల పాటు సినిమా షూటింగ్స్ మీద నిషేధం విధించింది.

అందుకే ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని జూలై లోకానీ, ఆగస్ట్ లో కానీ విడుదల చేయాలని దిల్ రాజు అనుకుంటున్నాడట. బాలీవుడ్ ‘పింక్’ రీమేక్ గా కోర్ట్ రూమ్ డ్రామా గా తెరకెక్కుతోన్న ఈ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ళ గ్యాప్ ను ఫిల్ చేసి.. అభిమానుల్ని అలరించబోతున్నాడు. మరి ‘వకీల్ సాబ్’ ఏ రేంజ్ లో సత్తా చాటుకుంటాడో చూడాలి.

Leave a comment

error: Content is protected !!