కరోనా వైరస్ భయంతో ప్రపంచమంతా ఒణికిపోతున్న సంగతి తెలిసిందే. దాంతో ఇండియా మొత్తం కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ నియమాలకు కట్టుబడి లాక్ డౌన్ ను ఫాలో అవుతోంది. ఈ నేపథ్యంలో రాజు నుంచి పేద వరకూ,  సాధారణ ప్రజానీకం నుంచి సినీ సెలబ్రిటీస్ వరకూ అందరూ ఇంటికే పరిమితమయ్యారు.  అందులో పలువురు అందరినీ ఇంట్లోనే క్షేమంగా ఉండాలని కోరుకుంటూ.. ఇంట్లో ఉండి తాము చేసే కొన్ని ప్రయోజనకరమైన పనుల్ని సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేస్తున్నారు. అందులో అందాల పాయల్ రాజ్ పుత్ ఒకరు.

పాయల్ రాజ్ పుత్ లాక్ డౌన్ ను పురస్కరించుకొని ఇంట్లోనే ఉంటూ.  తెలుగు నేర్చుకుంటూండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 21రోజుల పాటు 21 వాక్యాల్ని నేర్చుకుంటున్నట్టు చెబుతోంది. ఇంటర్నెట్ సహాయంతో పాయల్ తెలుగు పదాల్ని హిందీలో రాసుకొని మరీ సాధన చేస్తోందట. తెలుగు నేర్చుకోవడం చాలా కష్టమైనా ఎలాగైనా సరే తాను నేర్చుకొని తీరతానని ఇన్ స్టా గ్రామ్ ద్వారా వెల్లడించింది.

 

Leave a comment

error: Content is protected !!