సౌత్ లోనే డ్యాన్సుల్లో రారాజు మెగాస్టార్ చిరంజీవి. ఆయన డ్యాన్స్  ను అప్పుడూ, ఇప్పుడూ , ఎప్పుడూ మ్యాచ్ చేసే హీరోనే ఇంకా పుట్టలేదు. పుట్టబోడు కూడా. ఏజ్ ఎంత పెరిగినా.. ఆయన డ్యాన్సుల్లో గ్రేస్, ఈజ్ , మెరుపులు ఇంకా తగ్గలేదని ఆయన కమ్ బ్యాక్ మూవీ ఖైదీనెం.150 చిత్రంతోనే ఫ్రూవ్ అయింది. ఇప్పుడు మరోసారి ఆయన డ్యాన్స్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ మధ్య ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి కరోనా పైన అవగాహన కల్పిస్తునే మరోపక్కా కావాల్సినంత ఫన్ ని అందిస్తున్నారు. ఈ ఆదివారం రోజున  చిరంజీవి అలనాటి హీరోయిన్లు అయిన సుహాసిని, ఖుష్బూ, జయసుధ, రాధ, రాధక, లిజి ప్రియదర్శన్‌లతో కలసి చిరంజీవి స్టెప్పులేసిన వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో అభిమానుల్ని ఎంతగానో అలరిస్తోంది.

అయితే ఇది ఇప్పటి వీడియో కాదు.. గత ఏడాది చిరంజీవి కొత్త ఇంటిలో ఈ రీయూనియన్ జరిగింది. అయితే ఈ రియునియన్ వేడుకకి తెలుగు, తమిళ, మలయాళ, హిందీ నటీనటులు ఒక చోట కలిసి సందడి చేశారు. వెంకటేష్, నాగార్జున, మోహన్‌లాల్, రాధిక, శరత్ కుమార్, ప్రభు, రెహమాన్, భానుచందర్, నరేష్‌, సురేష్‌, జయసుధ, నదియా, రమ్యకృష్ణ, శోభన, సుహాసిని, రేవతి, సుమలత, రాధ, లిజి, పూర్ణిమ, భాగ్యరాజ్‌, జాకీ ష్రాఫ్‌, జగపతిబాబు తదితరులు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలో నటీనటులంతా చాలా హ్యాపీగా గడిపారు. ఆటపాటలతో కలసి సందడి చేశారు. అయితే ఇందులో చిరంజీవి సుహాసిని, జయప్రద, జయసుధ, రాధ, రాధిక లతో కలిసి స్టెప్స్ వేశారు. ఈ వీడియోను షేర్ చేస్తూ.. అలనాటి స్మృతులను గుర్తుచేసుకున్నారు.

Leave a comment

error: Content is protected !!