టాలీవుడ్ లో  రాజమౌళి, కొరటాల శివ తర్వాత అపజయమే ఎరుగని దర్శకుడిగా అనిల్ రావిపూడి పేరు మారుమోగుతోంది. సరైన కేస్టింగ్, పెర్ఫెక్ట్ ప్లానింగ్, అదిరిపోయే స్ర్కీప్ట్ అతడి బలాలు. ఈ మూడింటినీ పకడ్బందీగా సెట్  చేసుకొని .. ఇప్పటివరకూ  ‘పటాస్, సుప్రీమ్, రాజా  ది గ్రేట్, ఎఫ్2’.. రీసెంట్ గా ‘సరిలేరు నీకెవ్వురు’ చిత్రాలతో సూపర్ డైరెక్టర్ అనిపించుకున్నడు అనిల్. ఇప్పుడు అతడి దృష్టంతా ‘ఎఫ్ 2’ సీక్వెల్ ‘ఎఫ్ 3’ మీదే ఉంది. వెంకీ, వరుణ్ లపై అద్భుతంగా వర్కవుటైన ‘ఎఫ్2’ ను దృష్టిలో పెట్టుకొని దిల్ రాజు .. ఆ సినిమాకి సీక్వెల్ ను ఎప్పుడో ప్లాన్ చేశాడు. ఇప్పుడు దానికి సరైన టైమొచ్చింది.

అయితే నిన్న మొన్నటివరకూ ‘ఎఫ్3’ లో  మూడో హీరోగా రవితేజ ను దింపాలని అనిల్ రావిపూడి భావించాడు. కానీ ఎప్పుడైతే మహేశ్ బాబు తో తెరకెక్కించిన  ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం  బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసిందో.. అప్పటినుంచి అనిల్ ప్లాన్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళిందట. ఇందులో రవితేజ కు బదులుగా మహేశ్ బాబు ను మరో హీరోగా తీసుకొస్తే సినిమాకి మరింత క్రేజ్ వస్తుందని అనిల్ రావిపూడి , దిల్ రాజు భావిస్తున్నారట. ఆల్రెడీ వెంకీతో కలిసి మహేశ్ ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రం లో నటించి..ఆ సినిమా సూపర్ హిట్టు కు తానుకూడా ఒక కారణం అయ్యాడు. అందుకే మరోసారి ఈ జోడీతో మేజిక్ చేయాలనుకుంటున్నారట. ఇక ఈ సినిమాలో మహేశ్ బాబు 40 నిమిషాలు కనిపిస్తాడట. అంతేకాదు ఈ సినిమాకథ.. ‘ఎఫ్2’ కు కంటిన్యూషన్ గా కాకుండా.. వేరే ఫ్రెష్ స్టోరీతో సినిమాను తెరకెక్కిస్తారట. త్వరలోనే ఈ సినిమాలో మహేశ్ బాబు నటిస్తున్నాడని అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోంది.  సో..  వెంకీ, మహేశ్ బాబు, వరుణ్ తేజలపై ఈ సారి మోర్ ఫన్ , మోర్ ఫ్రస్టేషన్ అన్నమాట.

 

Leave a comment

error: Content is protected !!