మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ డెబ్యూ మూవీ ‘ఉప్పెన’ ప్రస్తుతం సెట్స్ మీదున్న సంగతి తెలిసిందే. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతోంది. ఏప్రిల్ 2న విడుదల తేదీ లాక్ చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్స్ ను ఎప్పుడో ప్రారంభించింది చిత్ర బృందం. అందులో  భాగంగా విడుదలైన ఒక లిరికల్ అండ్ వీడియో సాంగ్  ఆల్రెడీ ట్రెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ‘నీ కన్ను నీలి సముద్రం’ అనే ఆ పాటలో తన అందంతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేసేసింది కథానాయిక కృతీ శెట్టి. అందుకేనేమో అమ్మడు  ఆ సినిమాకి ఇంకా విడుదల కాకుండానే మరో క్రేజీ మూవీలో కథానాయిక ఛాన్స్ కొట్టేసిందని సమాచారం.

సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై సూర్య ప్రతాప్ పల్నాటి (కుమారి 21 ఫేమ్) దర్శకత్వంలో నిఖిల్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘18 పేజెస్’. రీసెంట్ గా గ్రాండ్ గా లాంచయిన ఆ మూవీకి సుకుమార్,  బన్నీ వాసు నిర్మాతలు . ఈ సినిమాలోనే కృతి శెట్టి  కథానాయికగా  ఎంపికయిందని సమాచారం. రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి హీరోయిన్ గా కృతి అయితే యాప్ట్ గా ఉంటుందని సుకుమార్ భావించాడట. అనుకోవడమే తరువాయి.. అమ్మడికి అప్పుడే సెలెక్ట్ చేసేశారని వినికిడి. మొదటి సినిమా ఇంకా విడుదల కాకుండానే అప్పుడే  రెండో ఛాన్స్ పట్టేసిన కృతి శెట్టి ఆ మూవీతో ఏ రేంజ్ లో పేరు తెచ్చుకుంటుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!