టాలీవుడ్ లో ప్రస్తుతం  బాలకృష్ణ, బోయపాటి మూవీపైనే అందరి దృష్టి.  ‘సింహ, లెజెండ్’ మూవీస్ తర్వాత ముచ్చటగా మూడో చిత్రంగా తెరకెక్కనున్న ఈ మాస్ మసాలా సినిమాపై రోజుకో అప్డేట్ వినిపిస్తోంది. ఇప్పటికే ఇందులో బాలయ్య అఘోరా నటిస్తున్నాడన్న విషయం రివీలైన సంగతి తెలిసిందే.  కాశీ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సన్నివేశాల్లో అఘోరాగా బాలకృష్ణ నట విశ్వరూపం చూపిస్తాడని చెప్పుకుంటున్నారు. బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తోన్న ఈ సినిమా డివోషనల్ టచ్ తో కూడిన ఒక రివెంజ్ స్టోరీతో రూపొందనుందట.

అంతేకాదు దీనికి సంబంధించిన కథాంశం కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. చిత్ర కథ ప్రకారం ఇందులో బాలయ్య అండ్ ఫ్యామిలీపై నవగ్రహాల ప్రభావం ఉంటుందట. దాని వల్లనే బాలయ్య రెండు  పాత్రలూ చిన్నతనంలోనే విడిపోతాయట. ఒక పాత్ర కాశీలో పెరిగితే  మరోపాత్ర తల్లిదండ్రుల వద్ద పెరుగుతుందట. కాశీలో పెరిగిన బాలకృష్ణ అక్కడే కొంతమంది సాధువులతో సావాసం చేసి.. దివ్యత్వాన్ని పొందుతాడట.  ఆక్రమంలో వచ్చే ఎపిసోడ్ లోనే బాలకృష్ణ అఘోరాగా అదరగొట్టనున్నడని తెలుస్తోంది. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా హ్యాట్రిక్ హిట్టు సొంతం చేసుకుంటుందేమో చూడాలి..

Leave a comment

error: Content is protected !!