ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ ఎవైటెడ్ మూవీ బాలకృష్ణ , బోయపాటి కాంబో సినిమా.  ఈ హ్యాట్రక్ కాంబినేషన్ ఎప్పుడో సెట్ అయినా.. సెట్స్ మీదకు వెళ్ళడానికి మాత్రం ఇంకా ముహూర్తం కుదరలేదు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్న ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు, అలాగే ఒక పాత్ర అఘోరాగా నటిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ ఇంకా సెట్ అవలేదు. సౌత్ లో ఉన్న క్రేజీ కథానాయికల పేర్లన్నీ పరిశీలించారు. ముఖ్యంగా కీర్తి సురేశ్  ను బాగా ట్రై చేశారు. కానీ ఆమె వేరే ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండడం వల్ల అది సాధ్యం కాలేదట. అలాగే సీనియర్ హీరోయిన్ శ్రీయా ను కూడా అనుకున్నారు కానీ.. కుదరలేదు. ఇంకా మరికొంతమందితో  సంప్రదింపులు కూడా జరిగాయి. అయినప్పటికీ ఎంపిక ఇంకా పెండింగ్ లోనే ఉంది.

తాజా సమాచారం ప్రకారం ఇందులో కథానాయికగా అంజలి ఖాయం అయిందనే వార్తలొస్తున్నాయి. ‘డిక్టేటర్’ లో బాలకృష్ణ తో అంజలి బోలెడంత గ్లామర్ ను ఒలికించి అభిమానుల్ని ఆకట్టుకున్న నేపథ్యంలో బోయపాటి చిత్రం కోసం ఆమెనే కథానాయికగా ఖాయం చేయబోతున్నారని సమాచారం. మరి ఇందులో అంజలినే మెయిన్ హీరోయిన్నా లేక మరో కథానాయిక కూడా ఉంటుందా అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. మరి ఈ మూవీ అంజలికి ఏ రేంజ్ లో క్రేజ్ వస్తుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!