‘ఒక్కడు మిగిలాడు’ చిత్రం తర్వాత మూడేళ్ళ గ్యాప్ తీసుకొన్న మంచు మనోజ్.. ఇప్పుడు ‘అహం బ్రహ్మస్మి’ అనే పాన్ ఇండియా మూవీతో బరిలోకి దిగుతున్నాడు. రామ్ చరణ్ ముఖ్య అతిథిగా నిన్ననే లాంచ్ అయిన ఈ మూవీ ఈ నెల 11 నుంచి రెగ్యులర్ షూటింగ్  కు వెళ్ళనుంది. డివోషనల్ టచ్ తో కూడిన యాక్షన్ మూవీగా దీన్ని తెరకెక్కించనున్నాడు కొత్త కుర్రోడు శ్రీకాంత్ రెడ్డి . ఆ క్రమంలో ఈ మూవీలో పలు యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయట. ఆ యాక్షన్ సీన్సే సినిమాకి ప్రధాన హైలైట్స్ అని సమాచారం.

ఇక ‘అహం బ్రహ్మస్మి’ చిత్ర కోసం అవార్డ్ విన్నింగ్  స్టంట్స్ కొరియో గ్రాఫర్ పీటర్ హెయిన్స్ రంగంలోకి దిగనున్నాడట. హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ తో మొదటి షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారట. జూన్ నాటికి షూటింగ్ పూర్తి చేసి చిత్రాన్ని 2020 ఎండింగ్ లో రిలీజ్ చేయనున్నారు. తమిళ టీవీ యాంకర్ ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా యం.యం. ఆర్ట్స్  బ్యానర్ పై నిర్మాణం జరుపుకోనుంది. మరి అహం బ్రహ్మస్మి చిత్రం మంచు మనోజ్ కెరీర్ ను ఏ రేంజ్ లో మలుపు తిప్పుతుందో చూడాలి.

 

Leave a comment

error: Content is protected !!