‘భాగమతి’ తర్వాత అందాల అనుష్క నటిస్తోన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘నిశ్శబ్దం’. సాక్షి అనే మూగ, బధిర అమ్మాయిగా నటిస్తోన్న అనుష్క ఇందులో ఒక చిత్రకారిణిగా కూడా కనిపించ నుండడం ఆసక్తిరేపుతోంది. ఇందులో మరో అతి కీలకమైన పాత్రను తమిళ విలక్షణ నటుడు మాధవన్ పోషిస్తున్నాడు. అయితే ఈ సినిమా అంతటికీ ప్రధాన ఆకర్షణ, హైలైట్ అయ్యే మరో పాత్రను హాలీవుడ్ బెస్ట్ పెర్ఫార్మర్ మైకేల్ మ్యాడ్ సన్ పోషిస్తోన్న సంగతి తెలిసిందే. సియాటెల్ కాప్ గా ఆయన అభినయం అద్భుతం అని చిత్ర యూనిట్ చెబుతోంది.

అలాంటి ఆ వైవిధ్య నటుడు ఒక రోజు సెట్స్ లో ఉండగా సడెన్ గా మిస్ అయ్యాడట. చిత్ర యూనిట్ కంగారు పడి..అతడి కోసం జల్లెడ పట్టిందట. అయినా ప్రయోజనం లేకపోవడంతో .. ఒక డిటెక్టివ్ ను నియమించారట. అతడు  ఓ వారం రోజుల పాటు ట్రాక్ చేయగా.. మైకేల్ సాబ్ కెనడాలో ఉన్నట్టు తెలిసిందట. అతగాడ్ని ఎలాగోలా..కన్విన్స్ చేసి నిశ్శబ్దం మిగతా పార్ట్ కంప్లీట్ చేశారని తెలుస్తోంది. ఏప్రిల్ 2న రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సింది. మైకేల్ మ్యాడ్ సన్ మిస్సింగ్ వల్లనే ఇంత లేటయిందని ‘నిశ్శబ్దం’ గా మేటర్ తెలిసింది. . మరి ఈ సినిమాలో అతడి పాత్ర ఏ రేంజ్ లో హైలైట్ కానుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!