టాలీవుడ్ లో దాదాపు అందరు యంగ్  స్టార్స్ ను  హ్యాండిల్ చేసిన దర్శకుడు ‘సురేంద్రరెడ్డి’. మెగాస్టార్ ను సైతం ‘సైరా’ చిత్రంతో పెద్ద ఎత్తున ఎలివేట్ చేయడంలో  కూడా సూరి బాగా సక్సెస్ అయ్యాడు. ఆ క్రెడిట్ తోనే ఇప్పుడు ఈ దర్శకుడు పలువురు స్టార్ హీరోలతో తన తదుపరి చిత్రాల్ని ప్లాన్ చేస్తున్నాడు. అందులో మొదటగా.. రెబల్ స్టార్ ప్రభాస్ తో ఒక మూవీ చేయాలనుకుంటున్నాడు. అలాగే మెగా హీరో వరుణ్ తేజ తో కూడా ఓ మూవీ చేసే  ప్లానింగ్ లో ఉన్నాడు. ఇదిలాఉంటే.. సురేంద్రరెడ్డి త్వరలోనే నిర్మాణ రంగంలోకి కూడా అడుగు పెట్టబోతున్నడని తెలుస్తోంది.

టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ పొజీషన్ లో ఉన్న పలువురు  దర్శకులు సొంతంగా ప్రొడక్షన్ హౌస్ లు పెట్టుకున్నారు. పూరీ, సుకుమార్, క్రిష్ లాంటి దర్శకులు ఆ రంగంలో సక్సెస్ కూడా చవిచూశారు. అందుకే సురేంద్రరెడ్డి కూడా ఆ రూట్లో ఆలోచిస్తున్నాడట. త్వరలోనే సొంత నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసుకొని .. టాప్ బ్యానర్స్ తో అసోసియేట్ అయి  వరుసగా స్టార్ హీరోలతోనే చిత్రాలు నిర్మించాలనే ఆలోచనలో ఉన్నాడట.   త్వరలోనే అతడి  నిర్మాణ సంస్థకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందట. మరి దర్శకుడిగా టాప్ పొజీషన్ లో ఉన్న సూరి.. నిర్మాతగా ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

Leave a comment

error: Content is protected !!