ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘వీ’ మూవీని వచ్చేనెల్లో విడుదలకు సిద్ధం చేసే సన్నాహాల్లో ఉన్నాడు నానీ.   ఆ తర్వాత శివ నిర్వాణ ‘టక్ జగదీష్’ షూటింగ్ కు షిఫ్ట్ అవనున్నాడు.  అయితే దీని తర్వాత సినిమా కమిట్ మెంట్ కూడా అయిపోయింది. నానీ 27 గా త్వరలో లాంఛ్ కానున్న ఈ సినిమాకు ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యాయన్ దర్శకుడు. నిజానికి ఈ కథను పట్టుకొని చాలా మంది హీరోల దగ్గరకు వెళ్లిన రాహుల్ కు ..  అందరి నుంచీ తిరస్కరమే ఎదురైందట. ఆఖరికి అతడి కథకు నానీ ఓకే చెప్పడంతో .. త్వరలోనే మెటీరియలైజ్ కానుంది.

ఇక  ఈ సినిమాకి ఓ వెరైటీ టైటిల్ ను రిజిస్టర్ చేయించారట.  నానీ పుట్టిన రోజు సందర్భంగా..   ఈ సాయంత్రమే టైటిల్ తో సహా సినిమా అనౌన్స్ మెంట్ జరగనుందట. తాజా సమాచారం ప్రకారం నానీ 27 చిత్రానికి ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ లా ధ్వనించే.. ‘శ్యామ్ సింఘ రాయ్’ అనే వెరైటీ టైటిల్ ను రిజిస్టర్ చేయించినట్టు సమాచారం. ఈ సాయంత్రం ఓ కాన్సెప్ట్ విడియో తో పాటుగా ఈ టైటిల్ ను విడుదల చేస్తారని తెలుస్తోంది . ‘టాక్సీవాలా’ చిత్రంలో విజయ్ టాక్సీలో దెయ్యాన్ని  పెట్టిన ఈ దర్శకుడు ఈ సారి నానీ కి తోడుగా ఎవరిని తీసుకొస్తాడో చూడాలి.

Leave a comment

error: Content is protected !!