టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. కాలం కలసిరాక…‘వర్షం, జయం, నిజం’ లాంటి సినిమాలతో విలన్ అవతారమెత్తాడు డైనమిక్ హీరో గోపీచంద్ . ఆ తర్వాత మళ్ళీ హీరోగా మారాడు. ఆ క్రమంలో పలు విజయాలు సొంతమైనా.. కొంతకాలంగా సరైన స్థాయిలో రాణించ లేకపోతున్నాడు. ఆ మేరకు హీరోగా మంచి కథలు ఎన్నుకోవడం మనోడికి తలకు మించిన భారమైంది. అందుకే ఇప్పుడీ హీరో .. రూట్ మార్చబోతున్నాడని టాక్స్ వినిపిస్తున్నాయి. అంటే జగపతి బాబు తరహాలో సౌత్ లో ఖరీదైన విలన్ గా అవతరించాలని డిసైడయ్యాడట.

తాజా సమాచారం ప్రకారం రజనీకాంత్ , శివ కలయికలో త్వరలో సెట్స్ మీదకు వెళ్ళనున్న  సినిమాలో గోపీచంద్ విలన్ గా నటించనున్నాడట. శివ..  గోపీచంద్ తో గతంలో శౌర్యం, శంఖం లాంటి సినిమాలు తీశాడు. వాటిలో ‘శౌర్యం’ సూపర్ హిట్ కాగా.. ‘శంఖం’ డిజాస్టరైంది.  ఇప్పుడు తలైవా చిత్రంతో విలన్ గా మారి.. జగ్గూభాయ్ తరహాలో అన్ని భాషల్లోనూ విలన్ గా రాణించాలనుకుంటున్నాడట. మరి గోపీచంద్ విలన్ గా ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి. .

 

Leave a comment

error: Content is protected !!