Shopping Cart 0 items - $0.00 0

జనవరి 22న వస్తున్న ”తొంగి తొంగి చూడమాకు చందమామ”

 గురు రాఘవేంద్ర సమర్పణలో హరి వల్లభ ఆర్ట్స్ పతాకంపై దర్శకుడు ఆనంద్ కానుమోలు రూపొందించిన సినిమా ”తొంగి తొంగి చూడమాకు చందమామ”. ఈ చిత్రానికి ఎ. మోహన్ రెడ్డి నిర్మాత. దిలీప్, శ్రావణి హీరో హీరోయిన్ లుగా నటించారు. లవ్, రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ”తొంగి తొంగి చూడమాకు చందమామ” పూర్తి స్థాయి కుటుంబ చిత్రమిది. కథను అనుకున్నట్లు సినిమా బాగా తీశారు దర్శకుడు ఆనంద్ కానుమోలు. ఇష్టమైనది దక్కాలంటే ముందు మనం దానిని ప్రేమించాలి అది దక్కిందా లేదా అనేది తర్వాత విషయం, కానీ అలా ప్రేమిస్తే వాళ్ల విలువ మనకు తెలుస్తుంది అని చెప్పే చిత్రమిది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. జనవరి 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Aa

Leave a comment

error: Content is protected !!