Shopping Cart 0 items - $0.00 0

గీత రాతే మారిపోయింది

 

టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలో అత్యధిక పాప్యులారిటీ తెచ్చుకున్న కథానాయిక రష్మికా మందణ్ణ. ‘ఛలో , గీత గోవిందం, దేవదాస్, డియర్ కామ్రేడ్’ లాంటి మినిమమ్ బడ్జెట్ చిత్రాల్లో హీరోయిన్ గా మెరిసిన అమ్మడు కేవలం అందంలోనే కాకుండా.. అంతకన్నా ఎక్కువగా  పెర్ఫార్మెన్స్ పరంగా ఏకంగా  డిస్టెంక్షన్ లోనే పాసయిపోయింది.. దాని ఫలితంగా అమ్మడు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు ఎగరేసుకొని పోతూ మిగతా భామలకు గట్టి పోటీ గా మారింది.

మొదటగా మహేశ్ బాబు లాంటి సూపర్ స్టార్  సరసన ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. పెర్ఫార్మెన్స్ లో అతడికి ధీటుగానటించి..  అర్ధమవుతోందా? అంటూ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ప్రేక్షకుల్ని పడేసింది. ఆ సినిమా సూపర్ హిట్టు అవడానికి అమ్మడు కూడా ఒక కారణమవడంతో .. ఇప్పుడు రష్మికా రాతే మారిపోయింది. ఆ ఒక్క సినిమాతోనూ అమ్మడు.. పలువురు స్టార్ హీరోల  సినిమాల్లో కథానాయికగా అవకాశాలు అందుకుంటోంది.   యన్టీఆర్ త్రివిక్రమ్ మూవీలో రష్మికా మందణ్ణ నే కథానాయికగా ఫిక్స్ చేశారు. అలాగే.. బన్నీ , సుక్కు మూవీలో కూడా అమ్మడు దాదాపు కథానాయికగా ఖాయమైంది. ఇంకా మరికొందరు స్టార్ హీరోల సినిమాలలో కథానాయికగా రష్మికా పేరు  పరిశీలనలో ఉంది.  సో.. మొత్తానికి ఎలాగైతేనేం.. అమ్మడు టాలీవుడ్ టాప్ హీరోల సినిమాల్లో వరుసగా  కథానాయికగా నటించేస్తోంది. మరి మునుముందు ఇంకా ఏ స్థాయిలో భారీ ఆఫర్స్ అందుకుంటుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!