ఈ ఏడాది మహేశ్ ‘సరిలేరు నీకెవ్వరు’చిత్రంతో బ్లాక్ బస్టర్ బోణి కొట్టింది కన్నడ క్యూట్ గాళ్ రష్మికా మందణ్ణ. ఆ క్రెడిట్ తోనే వరుసగా యన్టీఆర్, త్రివిక్రమ్ మూవీలోనూ, బన్నీ సుక్కూ మూవీలోనూ కథానాయికగా ఎంపికైంది. టాలీవుడ్ ను ఆ విధంగా తన గిప్పులో పెట్టుకున్న ఈ సుందరి దృష్ణి ఇప్పుడు కోలీవుడ్ పై పడింది. అక్కడ ఏకంగా.. కోలీవుడ్ బ్రదర్స్ అయిన సూర్య, కార్తీ చిత్రాల్లో కథానాయికగా ఎంపికైందని సమాచారం. ఆల్రెడీ కార్తి కొత్త చిత్రం ‘సుల్తాన్’ ప్రస్తుతం సెట్స్ మీదుంది. భాగ్యరాజ్ కణ్ణన్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్నఈ సినిమాలో అమ్మడి ఎంపిక అఫీషియల్ గా అనౌన్స్ అయింది. తర్వాత  కార్తీ అన్న సూర్య వంతు .

సూర్య ప్రస్తుతం సుధా కొంగర దర్శకత్వంలో ‘‘సురారై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ ) చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ సెట్స్  మీదుంది. దీని తర్వాత సూర్య మాస్ దర్శకుడు హరి సినిమాలో నటించబోతున్నాడు.    ఇందులో ముందుగా విజయ్ ‘మాస్టర్’ లో హీరోయిన్ గా నటిస్తోన్న మాళవికా మోహనన్ ను కథానాయికగా అనుకున్నారు. కానీ ఆ తర్వాత నిర్ణయం మార్చుకున్నారట. ఆమె ప్లేస్ లో రష్మికా మందణ్ణను ఎంపికచేశారని సమాచారం. త్వరలోనే రష్మికా ఎంపిక గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావచ్చు.  ‘సింగం’ సిరీస్ తో మాస్ ప్రేక్షకుల మనసు దోచిన సూర్య,,  హరి కాంబోలో వస్తోన్న మరో సినిమా ఇంకే స్థాయిలో మ్యాజిక్ చేయనుందో.. అందులో రష్మికా మందణ్ణ పాత్ర ఎలా ఉండబోతుందో వెయిట్ అండ్ సీ.

Leave a comment

error: Content is protected !!