లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా అత్యవసర సేవలు తప్ప మిగతా పరిశ్రమల్ని స్థంభించిపోయాయి. దీంతో షూటింగ్స్ లేక హీరోలు ఇంటిపట్టునే కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. కొంత మంది ఇంట్లో రకరకాల గేమ్స్ ఆడుతున్నారు. కొందరు ఇంట్లో తమ భార్యలకు పనుల్లో సహాయపడుతున్నారు. అందులో భాగంగానే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకుడు రాజమౌళికి ఓ ఛాలెంజ్‌ విసిరారు. రాజమౌళి ఎన్టీఆర్ – చరణ్ లకు ‘బి ది రియల్ మేన్’ ఛాలెంజ్ విసిరాడు. రాజమౌళి ఛాలెంజ్ ను స్వీకరించిన తారక్.. టాలీవుడ్ సూపర్ సీనియర్లైన చిరంజీవి – నాగార్జున – వెంకటేష్ – బాలయ్యల తో పాటు దర్శకుడు కొరటాల శివను ఛాలెంజ్ చేశాడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన ఛాలెంజ్ ను స్వీకరించిన మెగా స్టార్ ఇంటి పనులన్నీ చేసి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వాక్యూమ్ క్లీనర్‌తొ ఇళ్లంతా క్లీన్ చేశారు మెగాస్టార్. ఆ తర్వాత కిచెన్‌లోకి వెళ్లి స్వయంగా దోశెలు వేశారు. ఆ తర్వాత ఆ దోశను తీసుకెళ్లి తన తల్లి అంజనా దేవికి అందించారు. తల్లి అంజనాదేవి కూడా ఆ టిఫిన్ తీసుకుని మొదటి ముద్దను చిరుకు తినిపించారు. అనంతరం ఆమె కూడా తిన్నారు. డైనింగ్ టేబుల్ వద్ద కూర్చొని తల్లితో ముచ్చట్లు చెబుతూ నవ్వుతూ ఉన్న వీడియోను మెగాస్టార్ చిరంజీవి పోస్టు చేశారు. ఈ వీడియోను చూసిన అభిమానులంతా పండగ చేసుకుంటున్నారు.

Leave a comment

error: Content is protected !!