కరోనా వైరస్ భయంతో ప్రపంచమంతా ఒణికిపోతున్న సంగతి తెలిసిందే. దాంతో ఇండియా మొత్తం కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ నియమాలకు కట్టుబడి లాక్ డౌన్ ను ఫాలో అవుతోంది. ఇక కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య ఇండియాలో కూడా భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ నివారణ కోసం బడా వ్యాపార వేత్తలు సినీ ప్రముఖులు పెద్ద మనసుతో విరాళాలు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు.  

ఇప్పటికే ఎంతో మంది సినీ స్టార్స్  తమ తమ స్థాయికి తగ్గట్టుగా భూరి విరాళాలిచ్చారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి సీనియర్ హీరో శ్రీకాంత్ కూడా చేరారు. మెగాస్టార్ చిరంజీవి నాయకత్వంలో ఏర్పాటైన కరోనా క్రైసిస్ చారిటీకి తనవంతు విరాళంగా శ్రీకాంత్ రూ. 5లక్షల విరళాన్ని ప్రకటించారు.

Leave a comment

error: Content is protected !!